

ఫెమా (FEMA) కేసులో లలిత్ మోదీ, బీసీసీఐకి భారీ ఊరట లభించింది. 2009 సాధారణ ఎన్నికల భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ను దక్షిణాఫ్రికాకు తరలించిన సమయంలో విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈడీ చేసిన ఆరోపణలను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (SAFEMA) అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. లలిత్ మోదీపై వ్యక్తిగతంగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తగిన ఆధారాలు లేవని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
ఈ తీర్పుపై స్పందించిన లలిత్ మోడీ, 16 ఏళ్ల న్యాయ పోరాటంలో నిజం గెలిచిందని పేర్కొన్నారు. ఐపీఎల్ అభివృద్ధే తన లక్ష్యమని, ఇప్పుడు జీవితంలో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్లో తన కుమార్తెకు బిడ్డ పుట్టబోతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్కు తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఐపీఎల్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన లలిత్ మోడీపై 2013లో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!