
క్రీడలు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన రైతు సంక్షేమ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులు మరణించారన్నది పూర్తిగా అవాస్తవమని, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన అన్నారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక రికార్డు సాధించామని మంత్రి తెలిపారు. 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, 6.3 లక్షల మంది రైతులకు ₹7,841 కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు. 13,000 వాహనాలతో రవాణా, 18.3 కోట్ల గన్నీ బ్యాగుల వినియోగంతో కొనుగోళ్లు పారదర్శకంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!