
జనరల్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొండా సురేఖ ఏఐసీసీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు సమాచారం.
ఇటీవల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించినప్పటికీ, కడియం శ్రీహరి అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి ఉమ్మడి వరంగల్కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించడంతో వివాదం మళ్లీ ముదిరింది. ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!