

కేంద్ర బడ్జెట్లో రైల్వే రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది. గత ఏడాది కేటాయించిన రూ.9,417 కోట్లతో పోలిస్తే, అదనంగా రూ.717 కోట్లను పెంచుతూ మొత్తం రూ.10,134 కోట్లను మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2009–14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి సగటున ఏడాదికి రూ.886 కోట్లే కేటాయించగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు దాదాపు 11 రెట్లు ఎక్కువ నిధులు అందుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ.92,649 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. 2014 తర్వాత 1,700 కిలోమీటర్లకు పైగా కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించామని, రాష్ట్రంలో రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తిగా పూర్తయిందని చెప్పారు. అమృత్ స్టేషన్ పథకం కింద 73 స్టేషన్ల అభివృద్ధికి రూ.3,418 కోట్లు వెచ్చిస్తున్నామని, ఇప్పటికే పలు స్టేషన్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే ఏపీలో వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల సేవలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్కు భారీ ఆర్థిక లాభం చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 3 గంటల లోపే ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం కవచ్ రక్షణ వ్యవస్థను వేగంగా అమలు చేస్తున్నామని, విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కూడా ఆగలేదని స్పష్టం చేశారు. జోన్ కార్యాలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!