

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాల మధ్య కూడా సర్పంచ్, వార్డ్ సభ్యులు గా గెలిచిన బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినా, కాంగ్రెస్ పోటీ చేసిన 44% సీట్లను కూడా దాటలేకపోవడం ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనమని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి జరగదని ప్రజలు నమ్మడం వల్లే కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, పెన్షన్లు, మహాలక్ష్మి, ఎరువుల కొరత, రైతుల ఇబ్బందులు ఇవన్నీ గ్రామీణ ప్రజలు గుర్తుంచుకున్నారని తెలిపారు. రెండేళ్ల పాలనలో గ్రామాల పరిస్థితి దిగజారడంతో, పంచాయతీ ఫలితాలు కాంగ్రెస్ కౌంట్డౌన్ ప్రారంభాన్ని సూచిస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా నిలుస్తుందని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!