

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1పై పూర్తి నియంత్రణ సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎల్&టి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ₹13,000 కోట్ల రుణాన్ని భుజం వేసుకోనుంది. అదనంగా ఎల్&టి ఈక్విటీ షేర్లకు ₹2,000 కోట్లు చెల్లించనుంది. దీంతో మెట్రోలో ఎల్&టి పాత్ర పూర్తిగా ముగిసింది.దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎల్&టి అధికారులతో చర్చలు జరిపారు. ఫేజ్-IIలో భాగస్వామ్యం చేయడానికి ఎల్&టి నిరాకరించడంతో పాటు, ఫేజ్-Iతో లింక్ చేసే ఒప్పందానికి కూడా రాలేదు. అందువల్ల మొత్తం వాటాను రాష్ట్రానికే అప్పగించింది.
ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి మెట్రో ఫేజ్-Iపై పూర్తి నియంత్రణ దక్కింది. దీంతో 160 కి.మీ. ఫేజ్-II విస్తరణ పనులకు మార్గం సుగమం కానుంది. తుది ప్రణాళిక త్వరలో మంత్రివర్గానికి సమర్పించబడనుంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!