

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ అమలుపై కీలక సూచనలు చేస్తూ, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, లోక్ సభ సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. వాటిని కలపడం సరైంది కాదని పేర్కొంటూ, మహిళా రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
డీలిమిటేషన్ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. లోక్ సభ సీట్లను 543 నుంచి 850కి పెంచి జనాభా ఆధారంగా పంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అన్నారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు నష్టపోయి, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కు కూడా లేఖ రాశారు. అన్ని రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. అందరికీ న్యాయం జరిగేలా సమతుల్య విధానాన్ని పరిశీలించాలని సూచించారు. సమానత్వం మరియు న్యాయం కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

















.jpg.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!