

తెలంగాణలో తొలిసారిగా మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక భేటీ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు ప్రాధాన్య అంశాల పై విస్తృతంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై కేబినెట్ దృష్టి సారించనుంది. ఎన్నికల ప్రక్రియ పై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
అదేవిధంగా రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై కూడా చర్చ జరగనుంది. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాల్సిన అంశాల పై కేబినెట్ సమగ్రంగా సమీక్ష చేయనుంది.
మేడారాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే దిశగా రూపొందించిన మేడారం మాస్టర్ ప్లాన్ పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అలాగే పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా సాగునీటి అవసరాలు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
మేడారంలో నిర్వహిస్తున్న ఈ తొలి కేబినెట్ సమావేశం రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!