
గాసిప్స్

తెలంగాణలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పై స్టే విధించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జియో 46 పై కొన్ని వెనుకబడిన కుల సంఘాలు గురువారం హైకోర్టు ను ఆశ్రయించాయి.
పిటిషనర్లు, అత్యంత వెనుకబడిన కులాలకు తగిన రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ, బీసీలను A, B, C, D వర్గాలుగా విభజించి వాటి ఆధారంగా రిజర్వేషన్ అమలు చేయాలని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ ఇప్పటి కే ప్రారంభమైనందున ఈ దశలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది.
అదేవిధంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!