
సినిమాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని పేర్కొంటూ ‘థ్యాంక్యూ జగన్ అన్నా’ అంటూ పోస్టు చేసింది. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన వీడియోను కూడా పార్టీ షేర్ చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ, నిర్వాసిత కుటుంబాల పునరావాసం, అవసరమైన అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన కీలక పనులు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ తెలిపింది. ఈ పనుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు క్రెడిట్ను పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. భోగాపురం విమానాశ్రయం వెనుక అసలు కృషి ఎవరిదో ప్రజలకు తెలుసని పార్టీ పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!