
జనరల్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. జైలులో ఉన్న అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే అనుమతి ఇచ్చి, ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించారు. అదేవిధంగా జగన్ కాన్వాయ్లో కేవలం ఎనిమిది వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అంపోలు జైలు మరియు శ్రీకాకుళం పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇదే సమయంలో జగన్ రాక కోసం విశాఖపట్నం విమానాశ్రయానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!