
క్రీడలు

ప్రభుత్వ యంత్రాంగంలో పొదుపు చర్యలను ప్రోత్సహించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన భద్రతా కాన్వాయ్లో ఉండే వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రధాన మంత్రి భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బలగాల సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాన్వాయ్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ప్రభుత్వంపై అదనపు భారం పడకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులనే వినియోగించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!