
బిజినెస్

పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” అంటూ ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇథనాల్ బ్లెండింగ్పై జరుగుతున్న చర్చ నేపథ్యంలో మిశ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతున్న పరిస్థితుల్లో పెట్రోల్లో ఇథనాల్ కలపడం అవసరమని జనార్దన్ మిశ్రా పేర్కొన్నారు. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా, సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!