

ఒంగోలులో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, తెదేపా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది. దామచర్లపై బాలినేని మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. జనసేనలో చేరి ఉండకపోతే తనను జైలుకు పంపించేవాడినని దామచర్ల అన్నారని బాలినేని ఆరోపించారు. తనపై, దామచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన అనుచరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
ఒంగోలు మున్సిపాలిటీలో రూ.8.5 కోట్లు మాయమయ్యాయని బాలినేని ఆరోపిస్తూ, ఆ డబ్బులు ఏమయ్యాయో దామచర్ల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలకు కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జనసేన మద్దతు లేకపోతే దామచర్ల ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచేవారా? అని ప్రశ్నించారు. తాను స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, దామచర్ల కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!