

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట హాజరుకానున్నారు. నంది నగర్లో ఉన్న కేసీఆర్ నివాసంలోనే విచారణ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలని కేసీఆర్ కోరినప్పటికీ, ఆ అభ్యర్థనను అధికారులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నంది నగర్ నివాసంలోనే ప్రశ్నించడం పై ఇరు పక్షాలు ఒప్పందానికి వచ్చాయి.
ఈ విచారణ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు శాంతియుత నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
SIT విచారణ నేపథ్యంలో నంది నగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచే అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు. నంది నగర్ బస్ స్టాప్, నంది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం, జేసీ రెడ్డి చికెన్ సెంటర్, యూనియన్ బ్యాంక్ బై-లేన్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్, ఎంఆర్సీ కమాన్, రోడ్ నంబర్ 12, సాగర్ సొసైటీ ‘టి’ జంక్షన్ వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మళ్లించారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!