

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల మంజూరు ప్రక్రియలో ముఖ్యమైన మార్పులు చేసింది. కొత్త పింఛన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగించేందుకు, ప్రతి జిల్లాలో తక్షణమే 200 కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కలెక్టర్లకూ పింఛన్ల మంజూరులో తగిన అధికారాలు లేకపోవడం, అత్యవసర ప్రజా ఫిర్యాదులను తీర్చడంలో ఇబ్బందులను ఎదుర్కొనటం వంటి సమస్యలను కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించిన సీఎం, ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పింఛన్లు ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు మరియు ఆపదలో ఉన్న వ్యక్తులకు మంజూరు చేయబడతాయి. జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి మరియు కలెక్టర్ల సమన్వయంతో వీటిపై నిర్ణయం తీసుకునే అధికారాలు ఇవ్వబడ్డాయి. పింఛన్ల పంపిణీలో ఎక్కడా రాజకీయ ప్రభావం లేకుండా, అర్హతను ప్రామాణికంగా పరిగణించాల్సిందని సీఎం సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!