
గాసిప్స్

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, సుంకాల తగ్గింపు నిర్ణయాలు, కీలక ప్రభుత్వ విధానాలపై ప్రధాని మోడీని ఎన్డీఏ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మోడీని సన్మానిస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటించారు.
సమావేశంలో ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్లోని అంశాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, ఉభయసభల్లో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయాలను ప్రజల వరకు చేర్చడంలో ఎన్డీఏ ఎంపీలు కీలక పాత్ర పోషించాలని మోడీ పిలుపునిచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!