
న్యూస్

సీనియర్ హీరో నాగార్జున అక్కినేని–మంత్రి కొండా సురేఖ వివాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో సమంత–నాగచైతన్య విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.
ఇదిలా ఉండగా, మంత్రి సురేఖ ఇటీవల ఎక్స్ (ట్విటర్) వేదికగా నాగార్జునకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు అనవసరమైన అపార్థం కలిగించాయని పేర్కొన్నారు.
ఆ క్షమాపణల అనంతరం, నాగార్జున ఈ కేసు విషయంలో తీసుకున్న తాజా నిర్ణయాన్ని నాంపల్లి కోర్టుకు తెలియజేశారు.
ఈ వివాదం నెలల తరబడి రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశం కాగా, ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!