
జనరల్

మోదీ ప్రభుత్వ విధానాలు పాలన వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. బంగారం వినియోగాన్ని తగ్గించుకోవాలి, విదేశీ ప్రయాణాలు తగ్గించాలి, అలాగే పెట్రోల్, డీజిల్, ఎరువులు, వంటనూనె వంటి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించడం ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతుందని ఆయన అన్నారు.
మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజలను ఏమి కొనాలి, ఏమి కొనకూడదు అనే స్థితికి తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. ప్రజలపై బాధ్యతను మోపుతూ ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోందని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!