
జనరల్

మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్పై గోప్యతకు సంబంధించిన విమర్శలు పెరుగుతున్నాయి. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉండటంతో భారత్ సహా పలు దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు వైరల్ కావడంతో బ్రిటన్లోని పబ్లు, రెస్టారెంట్లు వీటి వినియోగంపై ఆంక్షలు విధించాయి.
ఈ వ్యవహారంపై హేట్ఎయిడ్ సంస్థ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే రికార్డింగ్ సమయంలో ఎల్ఈడీ లైట్ వెలుగుతుందని, గోప్యతను కాపాడేందుకు రక్షణ చర్యలు ఉన్నాయని మెటా స్పష్టం చేస్తోంది. సాంకేతికత వినియోగం, వ్యక్తిగత గోప్యత మధ్య సమతుల్యతపై ఈ వివాదం చర్చకు దారితీస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!