

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. హాల్ద్వానిలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించిన ప్రదేశాన్ని బీజేపీ, హిందుత్వ సంస్థలు గంగాజలంతో శుద్ధి చేశాయన్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అక్కడ అడుగుపెట్టడం వల్ల ఆ ప్రాంతం అపవిత్రమైందన్న భావనతో శుద్ధి చేయడం దళితుల పట్ల వివక్షకు నిదర్శనమని షర్మిల అన్నారు. ఇది బీజేపీ కులదురహంకారం, విభజన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.
సామాజిక సమానత్వం, ఏకత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని షర్మిల తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న ప్రతి జిల్లాలో డీసీసీ ఆధ్వర్యంలో సాయంత్రం భారీ మార్చ్, సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ లేదా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద సత్యాగ్రహం నిర్వహించి, డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, పార్టీ విభాగాలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీకి బలమైన సందేశం ఇవ్వాలని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!