

ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన నిబద్ధతను చూపించారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడతారో, అక్కడికి స్వయంగా వెళ్లి పరామర్శించే నాయకుడిగా ఆయన నిలుస్తున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబంతో కొంత సమయం గడపాలని హైదరాబాద్ చేరుకున్న లోకేష్, ఉదయం కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనార్థం తరలివచ్చారు. ఎక్కువ సంఖ్యలో జనసందోహం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు గాయపడగా, కొందరు స్పృహ కోల్పోయారు.
వెంటనే స్పందించిన మంత్రి లోకేష్, హైదరాబాద్ నుంచి నేరుగా కాశీబుగ్గకు వెళ్లి బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. "ఎంత ఖర్చైనా ప్రాణాలను కాపాడండి" అంటూ వైద్యులను ఆదేశించారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించమని సూచించారు. దాదాపు రెండు గంటల పాటు ఆసుపత్రిలో ఉన్న లోకేష్, ప్రతి బాధితుని పరామర్శించి భరోసా ఇచ్చారు. మరోవైపు, లండన్లో ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తూ, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
లోకేష్ యొక్క వేగవంతమైన చర్య మరియు ఆన్-గ్రౌండ్ రెస్పాన్స్ చాలా మంది నుండి ప్రశంసలను పొందింది, ప్రజలు దీనిని నిజమైన కరుణ మరియు నాయకత్వానికి సంజ్ఞ అని పిలుస్తారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
Great gesture