

శ్రీవారి భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాదాల తయారీలో వేగం పెంచేందుకు తితిదే కీలక చర్యలు చేపట్టింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆధునికీకరిస్తూ పాత స్టీమ్ పాత్రల స్థానంలో అత్యాధునిక త్రీ జాకెట్ పాత్రలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం వెనుక భాగంలో కొత్త షెడ్డును నిర్మించి మొత్తం 22 పాత్రలను అమర్చే పనులు కొనసాగుతున్నాయి.
ఒక్కో పాత్రలో 60 కిలోల చొప్పున మొత్తం 22 పాత్రల్లో ఒకేసారి 1,320 కిలోల బియ్యాన్ని వండే సామర్థ్యం ఈ కొత్త వ్యవస్థకు ఉంది. గతంలో ఒక విడత అన్నం వండటానికి 25 నిమిషాలు పట్టగా, ఇప్పుడు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. రద్దీ రోజుల్లో భక్తుల సంఖ్య లక్షకు చేరడంతో వంట యంత్రాలపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, ఈ మార్పులు చేపట్టారు.
ఈ అత్యాధునిక పరికరాలను దాతలు విరాళంగా అందించగా, ఇప్పటికే ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా విజయవంతంగా వినియోగించారు. త్వరలో తిరుమలలో పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు.






.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!