
మండలిలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ టెస్ట్కు సిద్ధమా అంటూ రాజకీయ నాయకులకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డిని డ్రగ్స్ టెస్ట్కు తీసుకురాగలమని చెప్పిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే విధంగా టెస్ట్కు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బి-ఫారం ఇచ్చిన ప్రతి అభ్యర్థిని డ్రగ్స్ పరీక్షకు హాజరుపరచడానికి సిద్ధంగా ఉందని, ఇతర పార్టీలు కూడా అదే చేయగలవా అని సవాలు విసిరారు.
గత పదేళ్ల పాలనలో గంజాయి, డ్రగ్స్ విస్తృతి పెరిగి యువత మత్తుకు బానిసలయ్యారని ఆయన ఆరోపించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు కోరిన వారు డ్రగ్ అనాలసిస్కు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ అంశం ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా కొన్ని పేర్లు ముందుకు రావడం ఎందుకని కూడా సందేహం వ్యక్తం చేశారు.

.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!