.jpeg&w=3840&q=75)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో హిమాయత్ సాగర్ వేదికగా "మూసీ పునరుజ్జీవం - పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్" కార్యక్రమంలో పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మూసీ అభివృద్ధి ప్రాజెక్టును సుందరీకరణ కంటే భూసేకరణ పథకంగా మారుస్తుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹16,000 కోట్లతో, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ముసీ ప్రాంతంలో 6 కిలోమీటర్ల అభివృద్ధి చేపట్టిందని, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో విజయవంతంగా ప్రాజెక్ట్ అమలు అయినట్లు వివరించారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలతో సామాన్యుల ఇళ్లను కూల్చి, విపరీతమైన అవినీతిని ప్రోత్సహిస్తున్నదని. ప్రజలతో చర్చలు లేకుండా, సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు పక్కన పెట్టి వేలమంది ఇంట్లు నాశనం చేయబడుతున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రణాళికలు భూసేకరణ చట్టాలను పక్కన పెట్టి, సామాన్యులకు నష్టాన్ని కలిగించే విధంగా రూపొందించబడ్డాయని ఆయన విమర్శించారు.
అయితే, అభివృద్ధికి వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతిని మాత్రమే నిరోధిస్తామని, పార్టీలకు సంబంధం లేకుండా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, భూమి సమస్యలు, మూసీ బాధితుల సమస్యల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ప్రాంతంలో నిలబడతారని, రెండు సంవత్సరాల పాటు బాధితులు గట్టిగా పోరాడితే, కొత్త ప్రభుత్వం వచ్చి తరువాత ప్రతి ఒక్కరి ఇళ్ళు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!