

తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా టీవీకే చీఫ్, నటుడు విజయ్ సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం ప్రారంభమైన విచారణ దాదాపు ఆరు గంటలకుపైగా కొనసాగగా, సభ నిర్వహణ, జనం అంచనా, భద్రతా ఏర్పాట్లు, అలాగే ఘటనపై సమాచారం ఎప్పుడు తెలిసిందనే అంశాలపై అధికారులు పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
సెప్టెంబర్ 27, 2025 న కరూర్లో నిర్వహించిన బహిరంగ సభలో అనుమతికి మించిన సంఖ్యలో ప్రజలు హాజరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ను సీబీఐ విచారించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా, ఇది రాజకీయ కక్షసాధింపేనని ద్రవిడ మున్నేట్ర కజగం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, సీబీఐ మంగళవారం మరోసారి విచారణకు హాజరుకావాలని విజయ్కు నోటీసులు జారీ చేయగా, ఇప్పటికే విచారించిన జిల్లా అధికారుల స్టేట్మెంట్లతో విజయ్ వాంగ్మూలాన్ని సరిపోల్చనున్నట్లు సమాచారం.












.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!