

రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంలో వారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం మహా జాతరకు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను రాష్ట్రపతికి అందిస్తూ, జాతరకు హాజరుకావాలని సాదరంగా ఆహ్వానించారు.
మేడారం జాతర సంప్రదాయాల అనుగుణంగా, సమ్మక్క తల్లి చీర, కంకణం, కండువ బంగారాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మంత్రి సీతక్క జాతర ఘనత, ఆదివాసీ సంస్కృతిలో దాని ప్రత్యేక స్థానం, సమ్మక్క సారలమ్మ తల్లుల పోరాట చరిత్ర, వారి త్యాగం, ప్రజల విశ్వాసం, భక్తి, మేడారం అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ ఏర్పాట్లను వివరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మేడారం జాతర విశేషాలను ఆసక్తిగా విన్నారని, ఈ మహా జాతరలో హాజరయ్యేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తానని తెలిపారు. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మంత్రులకు ఆప్యాయంగా నూతన వస్త్రాలను బహూకరించి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!