
జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈసారి పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గిరిజనుల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలు పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.
అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ద్వారా నిర్మించిన రహదారులను పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన రెండు దశాంశ నాలుగు కిలోమీటర్ల రహదారిని కాలి నడకన పరిశీలిస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా పూర్తయిన రహదారులను ప్రారంభించి గ్రామ ప్రజలతో మాటామంతి నిర్వహిస్తారు. చివరగా గిరిజనులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!