
జనరల్

ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా సుమారు 25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.30 లక్షల కోట్లు) ఖర్చు అయిందని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ అంచనాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి అమెరికాకు వచ్చిన నష్టం ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
యుద్ధ ఖర్చుల విషయంలో పెంటగాన్ నిజాలను దాచిపెడుతోందని ఆరోపించిన అరాగ్చీ, ఇప్పటివరకు అమెరికాకు 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9 లక్షల కోట్లు) పైగా నష్టం వాటిల్లిందన్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విధానాల కారణంగా అమెరికా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని విమర్శించారు. ఈ ప్రభావం అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడుతోందని పేర్కొన్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!