

హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ తన బర్తరఫ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధిష్ఠానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా చివరి కోరిక ఏమిటో అడుగుతారని, కానీ తన విషయంలో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా పదవి నుంచి తొలగించారని అన్నారు. తిరుపతి రెడ్డి తదితరులు తనపై కక్షతో కుట్ర చేసి బర్తరఫ్ చేయించారని సురేఖ ఆరోపించారు.
సుమంత్ వ్యవహారంలోనూ తనను, తన కుటుంబాన్ని కావాలనే బద్నాం చేసేందుకు కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. సుమంత్ పేరుతో నేరాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన ఆరోపణలు చేసి తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. సుమంత్ కేసును సీసీఎస్కు బదిలీ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తనను బర్తరఫ్ చేయించడంలో ఉన్న నేతల్లో కొందరు గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఒక బీసీ మహిళా మంత్రిని ఎలా పదవి నుంచి తొలగించారో ప్రజలకు వివరించాలని సురేఖ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలు గళం విప్పాలని పిలుపునిచ్చారు. తన పదవి తొలగించడం వేరు, కానీ తనకు ముందుగా సమాచారం ఇవ్వాల్సిందని అన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో ఆమె ఓ లేఖను కూడా విడుదల చేసి, అందులో తన అభ్యంతరాలు మరియు ఆరోపణలను వివరించినట్లు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!