

కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసింది. సోషల్ మీడియాలో కేసీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయనపై నిషేధం విధించారు. అయితే, శ్రీశాంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో కేసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
నిషేధాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ గతంలో తిరువనంతపురం మున్సిఫ్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అనంతరం కేసీఏకు అధికారికంగా క్షమాపణలు తెలియజేసిన శ్రీశాంత్ వివరణను పరిశీలించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. దీంతో కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్) మూడో సీజన్లో ఏరీస్ కొల్లం సెయిలర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా ఆయన కొనసాగేందుకు మార్గం సుగమమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!