

ఆంధ్రప్రదేశ్ పేదల కోసం కూటమి ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. కొత్త నెల మొదటి రోజు అయిన ఇవాళ రాష్ట్రం లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా పెన్షన్ మొత్తం నేరు గా లబ్ధిదారులకు చేరే లా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఏలూరు జిల్లాలో జరిగే ఈ కార్యక్రమం లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపినాథ పట్నం ప్రాంతంలో పేదల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడానికి సీఎం సిద్ధమవుతున్నారు. అనంతరం నల్లమాడులో P4 మార్గదర్శకులు మరియు బంగారు కుటుంబాలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉంగుటూరు లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3:35 గంటలకు ఏలూరు జిల్లా పర్యటన ముగించుకుని ఆయన ఉండవల్లి నివాసానికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయింది.
ఇక మరో సమావేశంలో సీఎం చంద్రబాబు వైసీపీ పాలన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లో జరిగిన అన్యాయాలు, అవినీతి చర్యలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్ పై ఉందని పేర్కొన్నారు. ఉగాది నాటికి ఐదు లక్షల ఇండ్లను అర్హులైన వారికి అందజేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డిసెంబర్ నెలకు పార్టీ కార్యక్రమాల క్యాలెండర్ కూడా సిద్ధమైందని చెప్పారు.
పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించామని, భవిష్యత్తు లో కూడా పార్టీకి నిబద్ధతతో పని చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. పార్టీలో తప్పుదారులు పట్టే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!