
ఓటీటీ

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు గండిపేట భూకబ్జా కేసులో రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసుకు సంబంధించిన వాదనలు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కీలక నిబంధనలను విధించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. గండిపేట భూకబ్జా ఆరోపణల కేసులో అరెస్టైన ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!