

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు దుర్మరణం పాలవడం రాష్ట్రాన్ని కలిచివేసింది. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కూడా తక్షణమే అక్కడికి చేరుకుని బాధితులకు సహాయం అందించారు. స్వతహాగా వైద్యుడైన అప్పలరాజు, పరిస్థితి ఆవశ్యకతను గుర్తించి అక్కడే కొంతమంది క్షతగాత్రులకు సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అవసరమైన వారికి వెంటనే ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆయన సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా వర్గాల్లో వైరల్గా మారాయి. సాధారణంగా నేతలు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించడమే పరిమితమవుతుంటే, అప్పలరాజు మాత్రం స్వయంగా మైదానంలోకి దిగి వైద్య సహాయం అందించడం చర్చనీయాంశమైంది. ప్రజలు, అభిమానులు సోషల్ మీడియాలో “వైద్యో నారాయణో హరి” అన్నట్లు ప్రాణాలు కాపాడేందుకు క్షణం ఆలస్యం చేయని డాక్టర్ అప్పలరాజు నిజమైన సేవామూర్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!