

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మా బిడ్డలు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు “దిష్టి కళ్లతో” కోనసీమ పాడైందని ఆయన ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఎవరిపైనా దిష్టి పెట్టలేదు, కోనసీమలాగే తెలంగాణ కావాలని మాత్రమే కోరుకున్నాం. మా రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లైంది, ఎప్పుడూ “జై తెలంగాణ – జై ఆంధ్ర” అనే అన్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకున్నాం.
పక్క రాష్ట్రం బాగుంటే మా కళ్లు మండవు, ఎవరిది గుంజుకోవాలని అనుకోము. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంటులోనే మాట్లాడాను. మేము బాగుండాలని కోరుకుంటాం తప్ప పక్కవాడు చెడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపమే వేరుగా ఉండేది. మా బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారే తప్ప ఒక్క పరాయి రాష్ట్ర వ్యక్తి మీద కూడా చేయి ఎత్తలేదు.
ఆ రోజు మీరు కేవలం సినిమా నటుడిగా మాట్లాడితే అది అక్కడితో ఆగిపోయేది, కానీ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మీ మాటలను ఆంధ్ర ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నాను అని ఆమె అన్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!