
గాసిప్స్

మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జూమ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా టికెట్లు ఇవ్వొద్దని, సమష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు నిరూపించాయని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యత కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చైర్మన్, మేయర్ పదవులను ముందుగా ప్రకటించవద్దని, సామాజిక సమీకరణాల ప్రకారం వాటిని నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్గత విభేదాలకు తావు ఇవ్వకుండా, అందరూ కలిసి పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!