

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూలై 1న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, తిరుపతి జిల్లా శ్రీ సిటీలో రూ.750 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న హీరో మోటోకార్ప్ ప్రపంచ విడిభాగాల కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు తిరుపతిలో బస చేస్తారు.
జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ హామీ ఉపాధి జీవనోపాధి మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరుపతిలో జరిగే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సామర్థ్యాభివృద్ధి కార్యశాలలో పాల్గొంటారు. జూలై 3న కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి, అక్కడి నుంచి కుప్పంకు చేరుకుని జూలై 3 నుంచి 5 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. పర్యటన ముగిసిన అనంతరం జూలై 5న అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!