

జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పథకం పేరు మార్పు, నిబంధనల సవరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, 2006 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా 62 శాతం పేదలు, వెనుకబడిన వర్గాలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు పేదల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్త చట్టం మహిళా కూలీలకు నష్టం చేకూరుస్తుందని, పని దినాలు తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల వాటాను 60:40గా మార్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును వెంటనే పునరుద్ధరించాలని, ప్రస్తుతం ఉన్న పనుల జాబితాను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని సీఎం తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!