

గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరిగినా అది ఖజానాలో నిల్వ కాకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం తిరిగి వినియోగించామని కేంద్రం తెలిపింది. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల సందర్భంగా వివిధ రంగాల్లో సాధించిన విజయాలతో కరదీపిక విడుదల చేసింది. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని పేర్కొంది. పన్ను సంస్కరణలు, పాలన మార్పులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా దేశ ప్రగతి వేగవంతమైందని వెల్లడించింది.
జాతీయ భద్రత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల్లో సాధించిన విజయాలను కరదీపికలో వివరించారు. ఆపరేషన్ సిందూర్, డిజిటల్ గవర్నెన్స్ విస్తరణ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వంటి అంశాలు ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ కింద 43 కోట్ల కార్డులు జారీ కాగా, లబ్ధిదారులకు రూ.1.25 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. రైల్వే విద్యుదీకరణ 99.6% పూర్తయింది. వందేభారత్ రైళ్లు, చెనాబ్ వంతెన వంటి ప్రాజెక్టులు ప్రగతిని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ, పన్ను సంస్కరణలు మధ్యతరగతికి ఊరట ఇచ్చాయని కేంద్రం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!