

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల వర్చువల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ యొక్క ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ లక్ష్యం దేశ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు.
ప్రజాసేవ, ఉద్యమాల ద్వారానే రాష్ట్రంలో అధికారం సాధ్యమని నితిన్ నబీన్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. లోక్సభలో రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణ సాధనలో భాజపా పాత్రను గుర్తు చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!