

ఇరాన్లోని రెండు ప్రధాన కేంద్రాలపై ఇటీవల దాడులు జరిగాయి. అందులో ఒకటి అరాక్లోని భారజల రియాక్టర్. ఈ దాడిలో ఉత్పత్తి కేంద్రం తీవ్రమైన ధ్వంసానికి గురై, ఉత్పత్తి నిలిచిపోయింది అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) తెలిపింది. అయితే, అణుధార్మిక పదార్థాలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇరాన్ మార్చి 27న ఈ దాడులను ధృవీకరించింది, ప్రాణనష్టం లేదా రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది.
ఇక, ఇజ్రాయెల్ మిలిటరీ ఈ దాడులకు పాల్పడ్డారని తెలిపింది. మరోవైపు, ఉత్తర ఇరాన్లోని తబ్రిక్ పెట్రో కెమికల్ ప్లాంట్పై కూడా దాడి జరిగింది. ఈ ప్లాంట్లో చమురు, గ్యాస్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి, ఇందులో భారీ ధ్వంసం చోటు చేసుకుంది. ఐఆర్జీసీ అధికారులు నిరంతర దాడులకు గట్టి ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ‘‘వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా మాపై బెదిరింపులు చేస్తున్నా, అవి కొనసాగితే వారి సైనికులు, కమాండర్లు పర్షియన్ గల్ఫ్లోని షార్క్లకు ఆహారమవుతారు’’ అని అధికారులు చెప్పారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!