
న్యూస్

మహిళలను ప్రోత్సహించేందుకు రూపొందించిన నగదు బదిలీ (UCT) పథకాలు ఇప్పుడు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలకు సవాలుగా మారుతున్నాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు మహిళా కేంద్రిత పథకాల కోసం మొత్తం రూ.1.68 లక్షల కోట్లు వెచ్చించనున్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకాలు కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉండగా, ఇప్పుడు విస్తృతంగా పెరిగాయి. నివేదిక ప్రకారం, ఈ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు ఇప్పటికే రెవెన్యూలోటుతో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న యూసీటీ పథకాల వ్యయభారం కారణంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కూడా లోటులోకి జారిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో రాష్ట్రాల ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక సూచించింది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (2)
Big spending on welfare, but states need balance too.
Growing fiscal stress