

ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. జియో హాట్స్టార్ అధికారికంగా ప్రకటన చేస్తూ, ఈ నెల 6 నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఈసారి ప్రత్యేకంగా ఎక్స్టెండెడ్ కట్ను విడుదల చేయనున్నట్లు తెలిపి అభిమానుల్లో ఉత్సాహం పెంచింది.
ఈ ఓటీటీ వెర్షన్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్కు సంబంధించిన అదనపు సన్నివేశాలను కలిపినట్లు సమాచారం. ట్రైలర్లలో చూపించిన కొన్ని సీన్స్ సినిమా థియేటర్ వెర్షన్లో లేకపోవడంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేశారు. ఆ తర్వాత థియేటర్ రన్లో కొన్ని సన్నివేశాలు జోడించగా, ఇప్పుడు ఓటీటీ కోసం మరికొన్ని ముఖ్యమైన సీన్స్ను చేర్చాలని మేకర్స్ నిర్ణయించారు.
కథ విషయానికి వస్తే.. దేవనగర సంస్థానానికి చెందిన ఒకప్పటి జమీందారు గంగాదేవి (జరీనా వహాబ్) ప్రస్తుతం తన మనవడు రాజు (ప్రభాస్)తో సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఆమెకు మతిమరుపు ఉన్నా, తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం మర్చిపోదు. కలలో కనిపించే తన భర్తను తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. ఈ క్రమంలో రాజు నర్సాపురంలోని రాజ మహల్కు చేరుకుంటాడు. మార్మిక విద్యల్లో నిపుణుడైన కనకరాజును రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైందన్నదే కథలోని ప్రధాన అంశం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!