

నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్గా నిలిచే కీర్తి సురేశ్ నటించిన తాజా క్రైమ్ కామెడీ చిత్రం ‘రివాల్వర్ రీటా’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నవంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను పొందింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ నెల 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. జె.కె. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్కుమార్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
సినిమా కథ క్రైమ్, కామెడీ మిశ్రమంగా సాగుతుంది. శక్తివంతమైన డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్)ను హత్య చేసి తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) రూ.5 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంటాడు. హనీట్రాప్ ప్లాన్ సమయంలో పాండ్యన్ డ్రగ్స్ మత్తులో పొరపాటున రీటా (కీర్తి సురేశ్) ఇంటికి చేరతాడు. అక్కడ జరిగిన అల్లరిలో రీటా తల్లి (రాధికా శరత్కుమార్) కొట్టిన దెబ్బతో పాండ్యన్ అక్కడిక్కడే చనిపోతాడు. దీంతో రీటా కుటుంబం అనుకోని సమస్యల్లో చిక్కుకుంటుంది.
పాండ్యన్ను చంపి డబ్బు దోచుకోవాలని చూస్తున్న మార్టిన్ ముఠా వీరిపై ఒత్తిడి పెంచుతుంది. ఇదిలా ఉంటే, తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన బాబీ పాండ్యన్ (సునీల్)కి జరిగిన నిజం తెలిసిందా? రీటా కుటుంబం ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చిత్రంలోనే తెలుస్తాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!