

మలయాళ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ ఇటీవల ‘ఛాంపియన్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మరో తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు ఓటీటీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనస్వర నటించిన ఓ ఫీల్ గుడ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ సిరీస్లో తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. వీరిద్దరూ కలిసి చేసిన సిరీస్ పేరు ‘లక్కీ’. ఇందులో ఓ చిన్న కుక్కపిల్ల కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి హాట్స్టార్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే, తప్పిపోయిన ఓ కుక్కపిల్ల హీరోకు దొరుకుతుంది. అతడు ఆ కుక్కను ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఉన్న చిన్న పాపకు ఇస్తాడు. కానీ ఒక రోజు ఓ రాజకీయ నాయకుడు ఆ పెట్ డాగ్ను ఎత్తుకుపోతాడు. చివరకు ఆ కుక్కపిల్ల హీరోకు తిరిగి దొరికిందా లేదా అన్నదే ఈ సిరీస్ కథాంశం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!