

ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళ సినిమాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే పలు మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
సెన్నా హెగ్డే దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ కామెడీ మూవీ ‘అవిహితం’ జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 14వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో ప్రసారం కానున్న ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయింది.
ఈ చిత్రంలో ఉన్నిరాజ్, రెంజి కంకోల్, వినీత్ చాక్యార్, రాకేష్ ఉషార్, ధనేష్ కోలియత్, అజిత్ పున్నద్, బృందా మీనన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
భిన్నమైన కథ, బ్లాక్ కామెడీ స్టైల్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్తో ‘అవిహితం’ ఈ నవంబర్లో ఓటీటీలో నవ్వుల సందడి పండించబోతోంది.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!