
న్యూస్

థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలుపై ఒక క్రేన్ పడటంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన బుధవారం ఉదయం బ్యాంకాక్ నుంచి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
క్రేన్ ట్రాక్ పై పడటంతో రైలు బోగీలు తప్పిపోయాయి, కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి పోలీసులు మరియు రిస్క్యూ సిబ్బంది చేరి సహాయక చర్యలు చేపట్టారు.
ఇప్పటి వరకు 22 మంది మృతిచెందగా, 30కి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు మరిన్ని వివరాలను తెలియజేయడానికి పరిశీలన కొనసాగిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!