

ఎన్సీపీ రాజ్యసభ సభ్యురాలు, దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఈ రోజు (శనివారం) మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం నిర్వహించారు. అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా సునేత్ర పవార్ను ఈ ఉదయం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె రాజ్భవన్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
‘మహాయుతి’ ప్రభుత్వంలో అజిత్ పవార్ నిర్వహించిన మూడు శాఖలను ఆమెకు కేటాయించారు. ఫడ్నవిస్ ప్రభుత్వం సునేత్ర పవార్కు ఎక్సైజ్ శాఖ, క్రీడలు – యువజన సంక్షేమ శాఖ, మైనారిటీల అభివృద్ధి శాఖలను అప్పగించింది. అయితే కీలకమైన ఆర్థిక శాఖను ఆమెకు ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆర్థిక శాఖను తన వద్దే ఉంచి ఈసారి స్వయంగా బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తర్వాతే ఆ శాఖను ఎన్సీపీకి ఇవ్వడం లేదా దానికి బదులుగా మరో శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక, సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే విషయం తనకు తెలియదని, ఈ రోజు మీడియా వార్తల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని ఎన్సీపీ - ఎన్పీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఎన్సీపీ – ఎన్సీపీఎస్పీ విలీనాన్ని అజిత్ పవార్ కోరుకున్నట్టు, కానీ విమాన ప్రమాదం కారణంగా ఆ చర్చలు ఆగిపోయాయని చెప్పారు. శరద్ పవార్ వ్యాఖ్యల తర్వాత, అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ ఈ రోజు ఆయనను కలసి తాజా పరిణామాలను వివరించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!