

దేశ తీర ప్రాంత ప్రయోజనాలను కాపాడటంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సముద్ర వాణిజ్యంలో సుస్థిరతను తీసుకురావడంలో కూడా నేవీ ముఖ్య పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. విశాఖపట్నం తీరంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలిసి ఐఎన్ఎస్ సుమేధ నౌకపై ప్రయాణించారు.
నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ యుద్ధ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ నౌకలు, అలాగే 9 పరిశోధనా నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. మొత్తం 71 యుద్ధ నౌకలు ఆరు వరుసల్లో అద్భుత పరేడ్ నిర్వహించి నౌకాదళ శక్తిని ప్రదర్శించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!