ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి, సీఈవో కె. రాజేంద్ర కుమార్, సీవోవో గోపి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, హెరిటేజ్ ఫుడ్స్ ఎం. సాంబశివరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నిర్వహించబోయే తలసేమియా రన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అలాగే ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమైన దాతలను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండేషన్ డే కేవలం ఒక సంస్థ ఆవిర్భావ దినం మాత్రమే కాకుండా సేవా భావం, బాధ్యత, మరియు గొప్ప వారసత్వాన్ని గుర్తు చేసే రోజు అని పేర్కొన్నారు. సమాజ సేవను అర్థవంతంగా, కరుణతో, నిరంతరంగా కొనసాగించాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ సేవా ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు. రక్తదాన సేవలు, ఆరోగ్య శిబిరాలు, తలసేమియా బాధితుల సహాయం, విద్యా కార్యక్రమాలు, మహిళా సాధికారత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ విజయవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సేవలు సాధ్యమవ్వడానికి దాతల ఉదారత, విశ్వాసం మరియు నిరంతర సహకారమే ప్రధాన కారణమని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రామారావు ఆశయాల ప్రతిరూపంగా ఈ ట్రస్ట్ ఏర్పడిందన్నారు. మూడు దశాబ్దాలుగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సేవలు, విద్యా కార్యక్రమాలు, తలసేమియా బాధితుల సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ చేపట్టిందని తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎం. సాంబశివరావు మాట్లాడుతూ, హెరిటేజ్ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం CSR నిధులను ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వం, నారా భువనేశ్వరి గారి విజన్తో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తున్నాయని, ట్రస్ట్ కోసం పనిచేస్తున్న బృందం మరియు దాతల సహకారంతో ఈ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.





.png&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!